హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయాలని విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు శుక్రవారం పీఆర్టీయూ నేతలు మంత్రి కేటీఆర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
వెంటనే రేషనలైజేషన్తో కూడిన షెడ్యూల్ను విడుదల చేయాలని కోరారు. మంత్రిని కలిసినవారిలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి తదితరులు ఉన్నారు.