రఘునాథపల్లి, నవంబర్ 30 : మ్యుటేషన్ కోసం లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు దొరికాడు. వరంగల్ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన పేర్నె మల్లేశ్ మ్యుటేషన్ కోసం పంచాయతీ కార్యదర్శి సంతోష్ను ఇటీవల కలువగా రూ.5,090 చెల్లిస్తే పని పూర్తి అవుతుందని చెప్పాడు. చివరికి రూ.4,500లకు అంగీకరించాడు. బుధవారం పంచాయతీ కార్యదర్శి సంతోష్.. మల్లేశ్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.