హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలోని పంచాయతీరాజ్ టీచర్ల జీపీఎఫ్ ఖాతాలను కొత్త జిల్లాలకు మార్చుతూ ట్రెజరీ అకౌంట్స్ విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ఉన్న జీపీఎఫ్ ఖాతాలను టీచర్లు లేదా ఉద్యోగులు ఏ జిల్లాలో పనిచేస్తే ఆయా జిల్లాకు బదిలీ చేయాలని ఆదేశాలిచ్చింది.
రాష్ట్రంలో 33 జిల్లాలుగా ఏర్పడటం, ఇటీవలే ఉద్యోగులందరినీ జిల్లాల వారీగా కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా ఖాతాల్లోని మొత్తాన్ని కొత్త ఖాతాలకు బదిలీ చేయాలని ట్రెజరీ విభాగం డైరెక్టర్ కేఎస్ఆర్సీ మూర్తి ఆదేశించారు.