Palle Ravikumar | కల్లు గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్గా పల్లె రవికుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాధరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ పల్లె రవికుమార్కు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం అంటే తెలంగాణ ఉద్యమానికి గౌరవమన్నారు. ఉద్యమకారులను గౌరవించడంలో సీఎం కేసీఆర్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు.
చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో తెలంగాణా ఉద్యమంలో సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణతో కలిసి తెలంగాణ జర్నలిస్టులను భాగస్వామ్యం చేశారంటూ పల్లె రవి కుమార్ ఆయనను అభినందించారు. అందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రవికుమార్కు కార్పొరేషన్ చైర్మన్ పదతో సత్కరించారని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగాస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్న కుట్రలను ఛేదించడంలో మేధావులు ముందుండాలని కోరారు.