హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ): తాటి ఉత్పత్తులతో ఎన్నో ప్రయోజనాలున్నాయని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ తెలిపారు. చెన్నై నగర శివారులోని మాధవవరంలో తాటి ఉత్పత్తుల సెంట్రల్ ఇన్స్టిట్యూట్ను బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ్, కల్లు గీత కార్పొరేషన్ ఎండీ ఉదయ్ ప్రకాశ్తో కలిసి సోమవారం పరిశీలించారు.
తాటి ఆకులు, మట్టలతో పాటు కల్లు నుంచి తాటి బెల్లం, తాటి షుగర్, నీరా, అలంకరణ వస్తువుల తయారీ యూనిట్లను పరిశీలించారు. సంస్థ ఏడీ ప్రభాకర న్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వీఎస్ రావుతో మా ట్లాడి అక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పల్లె రవికుమార్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కల్లుగీత కార్మికుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పలు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.