ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపు
ఇల్లందకుంట, సెప్టెంబర్ 20: హుజూరాబాద్ ఉప ఎన్నికలో పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మల్లన్నపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ రాజీనామా చేసింది ప్రజల ప్రయోజనం కోసం కాదని, కేవలం తన స్వార్థం కోసమేనని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నదన్నారు. అలాంటి పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్కు ఓటు ద్వారా బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.