జనగామ రూరల్, ఏప్రిల్ 09 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం జనగామ మండలంలోని పెంబర్తి, వడ్లకొండ, ఎర్ర గొల్ల పహాడ్, అడవి కేశవాపురం గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం అమ్మకాలలో సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు. రైతుల సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.
మహిళా సంఘాలు మరింత బలోపేతం కావాలని మిల్లర్లు ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామ న్నారు. రైతుల ధాన్యం అమ్మిన తర్వాత చెల్లింపులు ఆలస్యమైతే త్వరగా జమ చేయిస్తానని , ప్రతి కొనుగోలు కేంద్రంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ధాన్యం అమ్మకాలలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
పాత బకాయిలు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెండున్నరేళ్లుగా రైతుల సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. మిల్లర్లు ఇబ్బందులు పెడితే కచ్చితంగా వారితో మాట్లాడి పరిష్కరి స్తానని స్పష్టం చేసారు. జనగామ నియోజకవర్గంలోని ప్రతి కొనుగోలు కేంద్రంపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యతగా తీసుకుం టానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, సర్పంచులు చిన్నబోయిన రేఖ, కాయిదాపురం మహేందర్ రెడ్డి, చిర్ర సత్యనారాయణరెడ్డి, భూ రెడ్డి చైతన్య ప్రమోద్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బాల్డే సిద్ధి లింగం, నాయకులు బైరగోని యాదగిరి గౌడ్, చంద్రం గౌడ్, సీఈవో భాస్కర్ రెడ్డి, రామ్మోహన్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ చిర శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు