మొయినాబాద్, మార్చి 4: విద్యా సంస్థలో అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యాజ్యోతి కళాశాల కరస్పాండెంట్, ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మం డలం హిమాయత్నగర్ గ్రామ రెవెన్యూ పరిధి లోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రగతి నివేదికను ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మజ అందజేశారు. పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడడుల్లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అకడమిక్స్, ఎక్ట్స్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థు లు ప్రపంచ పౌరులుగా ఎదగడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్ర మంలో సినీ నటుడు విశ్వక్సేన్, విద్యాజ్యోతి కళాశాల డైరెక్టర్ సాయిబాబారెడ్డి పాల్గొన్నారు.