జనగామ: జనగామ పట్టణంలో ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) టూర్ చేశారు. పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. ఆ సమయంలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఓ వార్డులో మహిళలు బోనాల నృత్యాలు చేస్తూ ఆయనకు వెల్కమ్ చెప్పారు.
గులాబీ కండువాలు కప్పుకున్న మహిళలు.. భారీ స్థాయిలో ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. బోనాలతో తీసిన ర్యాలీలో స్థానిక పట్టణ నేతలు కూడా హుషారుగా పాల్గొన్నారు.
కొన్ని వార్డుల్లో పల్లాకు స్వాగతం చెబుతూ భారీ భారీ ముగ్గులు వేశారు. సీఎం కేసీఆర్ వీరాభిమాని ఒకరు తన వేషంతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఒంటి నిండా గులాబీ నేతల బ్యానర్లను కట్టుకున్నాడు.
గులాబీ నేతల బొమ్మలతో చేసిన ఓ బ్యానర్ను టోపీలా చుట్టుకుని .. పల్లా ర్యాలీలో స్పెషల్గా కనిపించాడు. ఆ బీఆర్ఎస్ అభిమానిని స్థానిక నేతలు కూడా చుట్టుముట్టేసి ప్రచారాన్ని హోరెత్తించేశారు.