హుజూరాబాద్, అక్టోబర్ 25: బీజేపీ వ్యవహారం దొం గే దొంగ దొంగ అన్నట్టు ఉన్నదని, ఉప ఎన్నికలో బీజేపీ కవ్వింపు చర్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షు డు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్లో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ నాయకులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, 15 రోజులుగా వారి వ్యవహారం అలాగే ఉన్నదని మండిపడ్డారు. కమలాపూర్, ఇల్లందకుంటలో చేసిన ప్రయోగాలు విఫలం కావడంతో ఆదివారం పోతిరెడ్డిపేటలో గూండాయిజం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెడ్డి జేఏసీ పేరిట గందరగోళం సృష్టించడానికి ఒక టీవీ చానల్తో సహా వచ్చారని గుర్తుచేశారు. గలాట సృష్టించి, గొడవ పెట్టుకొని, దెబ్బలు తిని రాజకీయ లబ్ధిపొందేందుకు చూశారని చెప్పారు. టీఆర్ఎస్ శ్రేణుల సంయమనంతో వ్యవహరించారని వెల్లడించారు. బండి సంజయ్, రఘునందన్రావు తరహాలో పోలింగ్ వరకు ఈటల లేదా ఆయన భార్య అలిసిపోయి పడిపోయినట్టు నటించే అవకాశం ఉన్నదని ఆరోపించారు. నియోజకవర్గంలో వారిపై వారే దాడులు చేయించుకొని సానుభూతి డ్రామాలు ఆడే అవకాశమున్నదని.. హుజూరాబాద్ ప్రజలు వారి డ్రామాలను నమ్మొద్దని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్నే భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఆస్తుల కోసమే బీజేపీలోకి..
ఆస్తుల రక్షణ కోసమే ఈటల బీజేపీలో చేరారు. ప్రపంచం గర్వించదగ్గ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. కేసీఆర్కు ద్రోహం చేసిన ఈటల ప్రజలకు ద్రోహం చేయడనే నమ్మ కం ఏముంది. సింగరేణి విశ్రాం త ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం ఆలోచిస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలి.