మహబూబ్నగర్టౌన్/పాలమూరు/మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 11: రాష్ట్ర స్థాయి క్రీడలకు పాలమూరు వేదికగా మారిందని, ఇటీవల వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేశామని, ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు కృషిచేస్తానని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న పీర్ హషీం ఫుట్బాల్ టోర్నీని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. గతంలో బాలుర కళాశాల మైదానంలో కనీసం గ్రౌండ్ కూడా ఉండేదికాదని, అలాంటిది మంచి మైదానాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కూడా మరో స్టేడియం నిర్మించనున్నట్టు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామాల్లో క్రీడాప్రాంగణాలు నిర్మించామని, ఇప్పటివరకు 7,600 గ్రామాల్లో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి టోర్నీలకు వెళ్లే క్రీడాకారులకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. కాగా మహబూబ్నగర్ మండలం రాంచంద్రాపూర్లోని కాళికాదేవి ఉత్సవాలకు హాజరైన మంత్రి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం సిడె కార్యక్రమానికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బజరంగ్దళ్ నేతకు మంత్రి ఆర్థిక సాయం
మహబూబ్నగర్ జిల్లా బజరంగ్దళ్ అధ్యక్షుడు శ్రీకాంత్ బ్రెయిన్స్ట్రోక్తో స్థానికంగా ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మంత్రి ఆదివారం ఆయన్ను పరామర్శించారు. వైద్యం కోసం తక్షణమే రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. మెరుగైన వైద్యం అందించి శ్రీకాంత్ వెంటనే కోలుకునేలా చూడాలని వైద్యులను కోరారు.