హైదరాబాద్ : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దుశ్చర్యకు(Police harassment) పాల్పడ్డారు. ప్రాణ భయంతో రక్షణ కోరి వచ్చిన ప్రేమజంట( Couple) పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. చట్టబద్ధంగా రక్షణ కల్పించాల్సిన (Palakurthi SI) ఎస్ఐ దుర్నీతికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన అఖిల్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన కీర్తి ప్రేమించి ఏప్రిల్ 29న వివాహం చేసుకున్నారు.
అమ్మాయి కీర్తి కుటుంబ సభ్యులు అఖిల్ ఇంటి మీదకి వెళ్లి గొడవ చేశారు. దీంతో రక్షణ కల్పించాలని ప్రేమజంట పాలకుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే ఎస్ఐ వారిని బెదిరించి నానా దుర్భాషలాడుతూ మెడలో కట్టిన తాళిని తెంపారు. కాళ్లకు పెట్టిన మట్టెలను తీపించి ఇద్దరినీ కలవకూడదని హెచ్చరించాడు. దీంతో బాధితులు జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మాకు ప్రాణ భయం ఉందని, మాకు మా కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించాలని మీడియాకు వినతి పత్రం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.