హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): 2022 సంవత్సరానికి పంటల మద్దతు ధరలు 25 శాతం పెంచాలని తెలంగాణ రైతు రక్షక సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం.. అభద్రతాభావం పెంచేలా వ్యవహరిస్తు న్నదని శనివారం విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి 750 మంది రైతులు చనిపోయినా కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేయాలని కోరారు. నష్టపోయిన రైతులకు పంటల బీమా ద్వారా పరిహారం ఇవ్వాలని, బీమా ప్రీమియం ప్రభుత్వాలే చెల్లించాలని కోరారు.