కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన పద్మ అవార్డులలో తెలంగాణకు చెందిన 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో దర్శనం మొగిలయ్య మాట్లాడుతూ.. తనకు పద్మశ్రీ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
అయితే.. ఈ కళను సీఎం కేసీఆర్ బతికించారని.. ఆయన దయ వల్లనే ఇప్పుడు దేశమంతా కిన్నెర వాయిద్యం గురించి తెలుసుకుందని మొగిలయ్య చెప్పారు. తనకు ఈ గుర్తింపు రావడానికి.. భీమ్లా నాయక్లో పాడటానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఎంతో ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే.. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, మహబూబ్నగర్కు చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ కళను బతికించే విషయంలో తనకు ఎంతో సాయం చేశారని మొగిలయ్య తెలిపారు.