హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): చేనేత మిత్ర పథకం ప్రకటించి అమలుచేసిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందని పలువురు పద్మశాలి సంఘం నాయకులు కొనియాడారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నందుకు శనివారం సచివాలయంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో పలువురు పద్మశాలి సంఘం నాయకులు చేనేత జౌళిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు వారు ధన్యవాదాలు తెలిపారు.