హైదరాబాద్ : లష్కర్ బోనాల్లో భాగంగా తకరా బస్తీలోని ముత్యాలమ్మ ఆలయంలో జరిగే ఉత్సవాలకు విచ్చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ను ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ ఆహ్వానించారు. గురువారం తన కుమారుడు, టీఆర్ఎస్ యువ నేత తీగుళ్ల రామేశ్వర్ గౌడ్తో కలిసి ఉపసభాపతి ప్రగతిభవన్లో సీఎంను కలిశారు. ఆదివారం లష్కర్ బోనాలు వేడుకల్లో పాల్గొనాలని, అదేవిధంగా తన నివాసం వద్ద ముత్యాలమ్మ ఆలయంలో జరిగే ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. సభాపతి ఆహ్వానంపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రతి ఏటా ఉజ్జయిని మహంకాళి దేవాలయం బోనాల వేడుకల్లో పాల్గొన్న అనంతరం సికింద్రాబాద్లోని తీగుళ్ల పద్మారావు గౌడ్ ఇంటికి విందుకు హాజరు కావడం కేసీఆర్ ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.