మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు కులాన్ని రాజకీయంగా గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)అన్నారు. మెదక్ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ ప్యాలెస్లో మున్నూరు కాపు కృతజ్ఞత సభకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్యతో కలసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
జిల్లా మున్నూరు కాపు సంఘ భవనానికి ఎకరం స్థలంతో పాటు కోటి రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు. స్వరాష్ట్రంలో మున్నూరు కాపులను రాజకీయంగా ఆదరించింది సీఎం కేసీఆర్ అని తెలిపారు.
తెలంగాణ రాక ముందు సమైక్య రాష్ట్రంలో మున్నూరు కాపులను ఏ పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు.హైదరాబాద్ నడిబొడ్డులోని కోకాపేటలో ఐదు ఎకరాల స్థలంతో పాటు 5 కోట్ల నిధులు కేటాయించి మున్నూరు కాపుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారని ప్రశంసించారు.
మున్నూరు కాపులను కేసీఆర్ను కడుపులో పెట్టి చూసుకుంటున్నారని.. రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు బట్టి జగపతి, కల్లూరి హన్మంత్ రావు, దేమే యాదగిరి, జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్ కంఠారెడ్డి, తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డా. శివ దయాళ్, ఎంపీపీలు సబిత, సిద్ధి రామ్, కౌన్సిలర్లు నిర్మల, చందన, తదితరులు పాల్గొన్నారు.