హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ (Huzurabad) నియోజకవవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్(CM KCR).. హుజూరాబాద్ ఇన్చార్జిగా (Incharge) కౌశిక్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.