కొండాపూర్, మే 4: కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ముందుకొచ్చిందని చేవెళ్ల ఎంపీ జీ రంజిత్రెడ్డి తెలిపారు. కరోనా రోగులకు వైద్యసేవలందిస్తున్న కొండాపూర్ జిల్లా దవాఖానలో ఆక్సిజన్ కొరత రాకుండా సహకారమందించాలని బీడీఎల్కు లేఖలు రాయడంతోపాటు, స్వయంగా వెళ్లి విజ్ఞప్తిచేసినట్టు ఎంపీ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బీడీఎల్ రూ.కోటితో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించిందని చెప్పారు.