Sangareddy | జహీరాబాద్ , జనవరి 31 : సాధారణంగా జాతర అంటే భారీగా ప్రజలు తరలి వస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా పశువుల జాతర గురించి విన్నారా. అవునండి నిజంగానే పశువులు జాతర చేసుకుంటాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన న్యాల్కల్ గ్రామ శివారులోని పీర్ గైబ్ సాహెబ్ దర్గా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పశువుల జరుగుతుంది.
ఏడాది పొడవున తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఉత్సవాలు, జాతర నిర్వహిస్తూ ఉంటారు. కానీ పశువుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కూడా సాధారణ జాతరను పోలినట్లుగా సందడిగా ఉంది. ఈ పశువుల ఉత్సవాల్ని తిలకించేందుకు జాతరలో పశువుల్ని కొనుగోలు చేసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు వేర్వేరు ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు.

Cattle Fair1
మండల కేంద్రమైన న్యాల్కల్ మండల కేంద్రంలో పశువుల జాతర జరుగుతోంది. న్యాల్కల్ గ్రామ శివారులోని ఉర్సే షరీఫ్ పీరైట్ సాహెబ్ దర్గా రైతులు, ప్రజలతో కిటకిటలాడింది. ఎందుకంటే ఇక్కడ ఏడాదికి ఒకసారి పశువుల కోసం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో పశువులు విక్రయాలు చేయడానికి కర్ణాటక మహారాష్ట్ర తోపాటు చుట్టుపక్కల ప్రాంత వాసులు వచ్చి తమకు నచ్చిన ఎద్దులను విక్రయిస్తారు. కొనుగోలు చేస్తుంటారు. జత ఎద్దులను లక్షల్లో విక్రయాలు చేసి ఆ జతలకు కలర్ ఫుల్ గా బెలూన్స్ కట్టి ఊర్లోకి తీసుకెళ్తారు. ధరలు కూడా లక్షల్లో పలుకుతున్నాయి. ఎడ్లు ఉర్సును పురస్కరించుకొని నిర్వహించే పశువుల జాతర కు చిన్నారుల నుంచి పెద్దలు, రైతులు, వ్యాపారులు, పశుపోషకులు, కొనుగోలుదారులు, సందర్శకులతో కిక్కిరిసిపోతాయి.

Cattle Fair2
ఈ పశువుల జాతరలో జోరుగా పశువుల క్రయ, విక్రయాలు జోరుగా సాగుతాయి. వాటి ధరలు లక్షల్లో పలుకుతాయి.

Cattle Fair4
రోజురోజుకు అంతరించిపోతున్న పశుసంపదను కాపాడుకోవాలని కోరుతూ న్యాల్కల్ చెందిన స్వర్గీయ అప్ప గిరిజాబాయి మనుమడు సురేశ్ స్మారకార్థం అతని కుమారుడు ప్రముఖ శిల్ప కళాకారుడు డా. హోతి బస్వరాజ్ సొంత డబ్బులు వెచ్చించి మేలు రకం పశువులకు బసవ పేరిట అవార్డులు, ప్రోత్సాహాకాలు అందజేస్తారు. ఈ దర్గా జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా జాతర ఉత్సవాల్లో గత 359 సంవత్సరాలుగా ఈ పశువుల జాతరను నిర్వహించడం అనవాయితీగా వస్తుంది.

Cattle Fair3