సూర్యాపేట, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ‘రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయి పార్టీ మారిన కాంట్రాక్టర్కు ఓటు వేయం’ ‘నా ఓటు ఫ్రీ కరెంటు ఇచ్చే వారికే తప్ప 18 వేల కాంట్రాక్టర్కు కాదు..’ ఇలాంటి నినాదాలు రాసిన ప్లకార్డులు మునుగోడు పల్లెల్లో కనిపిస్తున్నాయి. మరికొందరు ఏకంగా తమ బైకులపై ‘రూ.18 వేల కోట్లు’ అనే అక్షరాలను ప్రదర్శిస్తున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధంలేని సాధారణ ప్రజలు కూడా ఇలాంటివి ప్రదర్శిస్తుండటం విశేషం.