స్వరాష్ట్రంలో పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయి. మన పట్టణాలు తెలంగాణ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లుగా విరాజిల్లుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ పట్టణాలు అభివృద్ధికి నిండు నిర్వచనంలా నిలుస్తున్నాయి. మున్సిపల్శాఖ అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు విదేశీయులను సైతం మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆయా కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు అనేక దేశాలు తమ బృందాలను ప్రత్యేకంగా పంపిస్తుండటం విశేషం.
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): అభివృద్ధిలో తెలంగాణ పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ పట్టణాలు జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధిస్తున్నాయి. తెలంగాణ మున్సిపల్శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఇతర దేశాల నుంచి సైతం ప్రతినిధులు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పారిశుద్ధ్యం, హరితహారం, నిధులు, మౌలిక సదుపాయాలకు ఇస్తున్న ప్రాధాన్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ప్రతి నెలా ఠంచన్గా నిధులు విడుదల చేస్తున్నది. ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించేందుకు అర్బన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టింది. పచ్చదనం పెంపుదల కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 10% గ్రీన్ బడ్జెట్ కోసం కేటాయిస్తున్నది.
453 వైకుంఠధామాల నిర్మాణం
మరణించిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించేందుకు పట్టణాల్లో రూ.200 కోట్లతో వైకుంఠధామాల నిర్మాణం చేపట్టారు. మొత్తం 453 వైకుంఠధామాలు నిర్మించాలని నిర్ణయించగా, ప్రస్తుతం 296 పనులు పూర్తయ్యాయి. మరో 145 పనులు పురోగతిలో ఉన్నాయి. మృతదేహాలను తరలించడానికి 138 పట్టణ స్థానిక సంస్థలకు 174 వైకుంఠరథాలను ప్రభుత్వం సమకూర్చింది.
నిర్మాణంలో ఎఫ్ఎస్టీపీలు
రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో రూ.430 కోట్లతో 139 ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు(ఎఫ్ఎస్టీపీ) నిర్మించాలని సంకల్పించి 22 పనులు పూర్తి చేశారు. మరో 18 అతి త్వరలో పూర్తికానున్నాయి. మిగతా 101 పురోగతిలో ఉన్నాయి. వీటిని వచ్చే మార్చి నాటికి పూర్తిచేయనున్నారు. జాతీయ స్థాయి పారిశుద్ధ్య నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛ సర్వేక్షణ్-2021-22 సంవత్సరానికి 27 అవార్డులను సాధించింది.
పారిశుద్ధ్య వాహనాల పెంపు
పట్టణ స్థానిక సంస్థల్లో ప్రస్తుతం 2,548 పారిశుద్ధ్య వాహనాలు ఉండగా మరో 2,254 కొత్త వాహనాలను కొనుగోలు చేశారు. పట్టణ స్థానిక సంస్థల ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా 2021-22లో 264 లక్షల మొక లు, 2022-23లో ఇప్పటివరకు 2.48 కోట్ల మొకలు నాటారు. 3,456 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటుచేసి వాటిలో 33.82 లక్షల మొకలు నాటారు. 1,208 కిలోమీటర్ల మేర మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ను చేపట్టారు. పది శాతం గ్రీన్ బడ్జెట్ కింద మూడేండ్లలో రూ.775 కోట్లు కేటాయించి ఖర్చు చేశారు. జి ల్లా కేంద్రంలో 20 జంతుసంరక్షణ కేంద్రాలు, మున్సిపాలిటీల్లో 368 ఓపెన్జిమ్లు, 772 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుచేశారు.
సమీకృత వెజ్, నాన్వెజ్ మారెట్లు
పట్టణాల్లో ప్రజలకు తాజా కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం ఉత్పత్తులు ఒకే స్థలంలో పరిశుభ్రమైన వాతావరణంలో లభించేలా సమీకృత వెజ్, నాన్వెజ్ మారెట్లను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లతో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టింది. 144 పట్టణ స్థానిక సంస్థల్లో వెజ్, నాన్వెజ్ మారెట్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచింది. ఏడు ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి కాగా 125 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి.