హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): యువతరం కలలు కంటున్న తెలంగాణను నిర్మించే సత్తా ఉన్న నాయకుడు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని యువ ఆవిష్కర్తలు పాహీ అగర్వాల్, వేదాంత్నాథ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో శుక్రవారం వాటర్ అండ్ శానిటేషన్ హైజీన్(వాష్) ముగింపులో ఈ ఇద్దరిని మంత్రి కేటీఆర్ కలిశారు. వారి ఆవిష్కరణ గురించి తెలుసుకొని అభినందించారు. ఈ మేరకు శనివారం కేటీఆర్ను కలిసిన ఫొటోలను ట్వీట్ చేసిన వీరిద్దరూ ‘తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో కేటీఆర్ సార్కు ఓ విజన్ ఉంది. మీలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వం, యువతతో కలిసి మంచి భవిష్యత్తును కల్పించగలదనే నమ్మకాన్ని మీరు మాకు ఇచ్చారు. 2023లో మేము 18 ఏండ్లు దాటుతాం. మా తొలి ఓటు కేవలం కేటీఆర్ సార్కే వేస్తాం’ అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘గుడ్ చాయిస్.. మిమ్ములను కలవడం చాలా బాగుంది’ అని ట్వీట్ చేశారు.