తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 5 : రాయితీలతో రాజీపడమని.. రాజ్యాధికారమే ల క్ష్యంగా ముందుకుసాగుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. తమ వాటా దక్కేదాకా బీసీలను ఏకం చేసి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 7న బెంగళూర్లో జరుగనున్న జాతీ య ఓబీసీ మహాసభకు హైదరాబాద్లోని గ న్పార్క్ నుంచి బుధవారం సాయంత్రం బీసీ నేతలు ప్రత్యేక బస్సులో తరలివెళ్లగా, జాజుల శ్రీనివాస్గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మండల కమిషన్ సి ఫార్సులను అమలుచేయాలని దశాబ్దాలుగా బీసీలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు ప ట్టించుకోకపోవడం అన్యాయమని మండిపడ్డారు.
కమీషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్టు పార్లమెంట్లో ప్రకటించిన ఆగస్టు 7న ఏటా దేశంలోని బీసీలకు ఏకం చేస్తూ జాతీ య ఓబీసీ మహాసభలను అన్ని రాష్ర్టాల్లో నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే బెం గళూర్లోని సిటీ యూనివర్సిటీలో 11వ మ హాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు ఆయ న పేర్కొన్నారు. హక్కుల సాధన కోసం జరుగనున్న ఈ సభను చరిత్రాత్మక సభగా ఆయన అభివర్ణించారు. దేశంలోని 80కోట్ల ఓబీసీల ను ఏకం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ స భకు అన్ని రాష్ర్టాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు. బీసీ పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఈ సభలో పాల్గొంటారని తెలిపారు. బీసీ నేతలు గుజ్జ కృష్ణ, కుందారం గణేశాచారి, కుల్కచర్ల శ్రీనివాస్, బీ మణిమంజరి, పిట్ల శ్రీధర్, వీరస్వామి, గొడుగు మహేశ్యాదవ్, ఎం చంద్రశేఖర్ గౌడ్, దీటి మల్ల య్య, రమ, జాజుల లింగంగౌడ్, ఈడిగ శ్రీనివాస్గౌడ్ తదితరులు తరలివెళ్లారు.