ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 22: ఓయూ దూర విద్యాకేంద్రమైన ప్రొఫెసర్ జీ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే అన్ని డిగ్రీ కోర్సుల పరీక్ష తేదీలను మార్చినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ గురువారం తెలిపారు. ఈ నెల 27న ఓయూ స్నాతకోత్సవం ఉన్న నేపథ్యంలో ఆ రోజు నిర్వహించాల్సిన డిగ్రీ మొదటి, మూడో సంవత్సరం రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చేనెల ఆరో తేదీన జరుపనున్నట్టు పేర్కొన్నారు.
వివిధ కోర్సుల పరీక్ష ఫలితాల విడుదల
ఓయూ పరిధిలోని పీజీ డిప్లొమా ఇన్ కలినరీ ఆర్ట్స్, ఎంసీఏ కోర్సుల పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను www. osmania.ac.inలో చూడవచ్చు.