హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇన్ సర్వీస్ టీచర్లకు వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని టీఎస్ యూటీఎఫ్ కోరింది. టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి అని ఎన్సీటీఈ స్పష్టంచేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసిన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కే జంగయ్య, ప్రధానకార్యదర్శి చావ రవి వినతిపత్రం అందజేశారు. మల్టీజోన్-2తో జీహెచ్ఎం పదోన్నతులు కల్పించాలని, మల్టీజోన్ -1లో బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లను రిలీవ్చేయాలని కోరారు.