ఖమ్మం, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సేంద్రియ సాగు విధానం ఎంతో మేలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామాన్ని సందర్శించారు.
సేంద్రియ సాగు చేస్తున్న చెరుకూరి రామారావు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. సేంద్రియ ఎరువుల తయారీని తెలుసుకొన్నారు. సుమారు 20 ఎకరాల్లో ఇరవైకిపైగా పంటలను సాగు చేస్తున్న రైతును అభినందించారు. ఆదివారం తమ జిల్లాలోని రైతులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, సేంద్రియ సాగుపై అవగాహన కల్పించేందుకు సూర్యాపేట రావాలని రైతు రామారావును మంత్రి ఆహ్వానించారు.