హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం రాష్ట్రంలో మరో రెండు రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎర్రవల్లి మండలాన్ని, కామారెడ్డి జిల్లాలో పాల్వంచ మండలాన్ని ఏర్పాటు చేస్తూ మంగళవారం రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటిక్యాల మండలంలోని 9 గ్రామాలను కలిపి ఎర్రవల్లి మండలంగా, మాచారెడ్డి మండలం నుంచి 9 గ్రామాలు, రామారెడ్డి మండలం నుంచి ఒక గ్రామాన్ని కలిపి పాల్వంచ మండలంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.