విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. కాసేపట్లో ఎయిర్పోర్టులో దిగనున్నారు. ఆయనకు స్వయంగా స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు.
బేగంపేట ఎయిర్పోర్ట్నుంచి జలవిహార్కు 5వేల మందితో బైక్ ర్యాలీగా వెళ్లనున్నారు. జలవిహార్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్, యశ్వంత్ సిన్హా ప్రసంగించనున్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే జలవిహార్కు చేరుకున్నారు. జలవిహార్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా ఉంది.