హైదరాబాద్కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి రాక
ఆరు వేల బైకులతో ర్యాలీకి టీఆర్ఎస్ ప్లాన్
జలవిహార్లో పార్టీ ప్రతినిధులతో సభ
యశ్వంత్కు స్వాగతంపై మంత్రి కేటీఆర్ సమీక్ష
సభ ఏర్పాట్లను పరిశీలించిన టీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్/ సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హా శనివారం హైదరాబాద్కు రానున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలకాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. సుమారు ఆరు వేల బైకులతో బేగంపేట ఎయిర్పోర్టు నుంచి జలవిహార్కు ర్యాలీ నిర్వహించనున్నారు. సిన్హా పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం మంత్రులు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. సిన్హా శనివారం ఉదయం 10 గంటలకు విమానాశ్రయానికి చేరుకొంటారని, స్వాగ తం పలికే బాధ్యతలు మంత్రులు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఉద యం 11 గంటలకు జలవిహార్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, దానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు సహా పార్టీ ముఖ్య నేతలంతా హాజరయ్యేలా చూడాలని సూచించారు.
సిన్హాకు ఘన స్వాగతం పలుకుతామని, జలవిహార్ సభ లో సీఎం కేసీఆర్ ప్రసంగం తర్వాత యశ్వంత్సిన్హా మాట్లాడుతారని రాష్ట్రపతి ఎన్నిక ప్రచార కమిటీ సభ్యుడు, ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. తర్వాత గాంధీభవన్, ఎంఐఎం కార్యక్రమాలకు సిన్హా హాజరై సాయంత్రం బెంగళూరుకు వెళ్తారని పేర్కొన్నా రు. కేటీఆర్తో భేటీలో మం త్రులు మహమూద్ అలీ, తలసాని, మల్లారెడ్డి, సబితారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు నాగేందర్, మా గంటి గోపీనాథ్, గోపాల్, అరికెపూడి గాంధీ, హన్మంతరావు, కాలె యాద య్య, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభ ఏర్పాట్లను పరిశీలించారు.