హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏప్రిల్ 20 నుంచి మే 26వరకు ఈ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను www. telangana open school.org. వెబ్సైట్లో ఉంచారు. మహిళలు పదో తరగతిలో 63.97%, ఇంటర్లో 63.41% పాస్ అయ్యారు.
పురుషులు పదోతరగతిలో 53.24%, ఇంటర్లో 57.49% ఉత్తీర్ణులయ్యా రు. పదో తరగతిలో 28,547 మంది పరీక్షలు రాయగా, 16,443 (57.60)% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్లో 41,051 మంది పరీక్షలు రాస్తే, 24,538 (59.77%) పాసయ్యారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 12 నుంచి 18 వరకు ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు.