మునుగోడు, అక్టోబర్ 17: వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి ఓటు వేయాలని కోరుతూ ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టాలంటే టీఆర్ఎస్ మాత్రమే ఓటేయాలని కోరారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు. కార్యక్రమంలో కోతులారం మాజీ సర్పంచ్ జక్కల లోకేశ్, నాయకులు జాజుల నర్సింహ, కందుల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.