దళిత ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గజ్జెల కాంతం
హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 1: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలువకుండా దళిత, గిరిజన బిడ్డలు మరో యుద్ధానికి సిద్ధమయ్యారని తెలంగాణ దళిత ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం తెలిపారు. శుక్రవారం ఆయన దళిత గిరిజన సంఘాల నాయకులతో కలిసి హుజూరాబాద్లో మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్యులపై భారం మోపిన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ధాన్యాన్ని కొనబోమని చెప్తూ కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. సుమారు 54 వేల ఓటు బ్యాంకు ఉన్న దళిత, గిరిజనులు బీజేపీకి ఒక ఓటు పడకుండా గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు ఓటు వేయాలని నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నామని చెప్పారు.