సూర్యాపేట : నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోళ్ల కేంద్రానికి తరలించాలని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. తద్వారా సరయిన ధరను పొందే వెసులుబాటు రైతులకు ఉంటుందని ఆయన చెప్పారు. యాసంగిలోనూ సూర్యాపేట జిల్లాలో ధాన్యం దిగుబడి రికార్డు సృష్టించిందని ఆయన వెల్లడించారు.
శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ల పై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన నాలుగు సంవత్సరాలను పోల్చుకుంటే ఈ యాసంగి వరి దిగుబడి ముందెన్నడూ లేని రీతిలో వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన కాళేశ్వరం జలాలతో ఇంతటి దిగుబడి సాధ్యం అయిందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. గడిచిన నాలుగు సంవత్సరాలను పోల్చుకుంటే ఈ యాసంగి వరి దిగుబడి ముందెన్నడూ లేని రీతిలో వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరం తో మొదట లబ్ధి పొందేది సూర్యపేట జిల్లా అన్నది మరోమారు రుజువు అయిందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు జిల్లాలో పెరిగిన వరి సేధ్యమే నిదర్శనమన్నారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ధాన్యాన్ని శుద్ధి చేసేందుకు గాను 72 యంత్రాలను వినియోగం లోకి తెనున్నట్లు ఆయన వెల్లడించారు.
అందుకు రైతులు సహకరించాలని ఆయన కోరారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు గాను మరో 23 రైస్ మిల్లులకు అనుమతులను అప్పటికప్పుడు కమిషనర్ తో మాట్లాడి మంత్రి జగదీష్ రెడ్డి మంజూరు చేయించారు.
ధాన్యం దిగుబడి పెరిగినందున నల్లగొండ జిల్లా లోని రైస్ మిల్లర్స్ సూర్యాపేట ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని సమీక్షా సమావేశం నుంచే రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని కోరారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సంబంధిత శాఖాధికారులు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు