విద్యానగర్, మార్చి 25: కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఆన్లైన్ ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. రోజుకు సుమారు వెయ్యి మందికిపైగా ఓపీ కోసం వస్తుండగా, వీరికి గతంలో చిన్న కాగితాల్లో ఓపీ రాసిచ్చేవారు.
నేడు అధార్కార్డులో ఉన్న వివరాలను నమోదు చేయడంతోపాటు వారికి కావాల్సిన వైద్య సేవల విభాగాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్లైన్లో ఓపీ సేవలు కొనసాగనున్నాయి. దీంతో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యాయి.