కేతేపల్లి/మహదేవపూర్, జూన్ 28: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. ప్రాజెక్టు అధికారులు మంగళవారం ఐదు గేట్ల ద్వారా దిగువకు నీటిని వదిలారు. సోమవారం రాత్రి వరకు ఎగువ నుంచి భారీ వరద రావడంతో అధికారులు ప్రాజెక్టు 3, 4, 7, 8,10వ నంబరు క్రస్టు గేట్లను అడుగున్నర మేర ఎత్తి 4,019.48 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రస్తుతం ఇన్ఫ్లో నిలిచిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 645 (4.46 టీఎంసీలు) అడుగులకు ప్రస్తుతం 643.10 (4.46 టీఎంసీలు) అడుగులు ఉన్నట్టు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మీబరాజ్లోకి వరద కొనసాగుతున్నది. 17,320 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో 10 గేట్లు ఎత్తి 15,310 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నట్టు ఏఈ షేక్వలీ తెలిపారు. బరాజ్ పూర్తిస్థాయి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.635 టీఎంసీల నీరున్నది.