నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 5: శ్రీరాంసాగర్కు వరద కొనసాగుతున్నది. మంగళవారం ప్రాజెక్టులోకి 1,27,450 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, నాలుగు వరద గేట్లను ఎత్తి 11,760 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా 1,090.60 అడుగుల (85.112 టీఎంసీల) నీటినిల్వ ఉన్నది. కాగా జూరాలకు 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 76,288 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా.. 9.480 టీఎంసీలు నిల్వ ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్ట్కు ఎగువ నుంచి 75,894 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 66,090 క్యూసెక్కులు అవుట్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 882.50 అడుగులుగా నమోదు కాగా.. సామర్థ్యం 215 టీఎంసీలకు గాను 202.0439 టీఎంసీలు నిల్వ ఉన్నది. నాగార్జునసాగర్ రిజర్వాయర్కు 79,143 క్యూసెక్కుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో నమోదైంది. పూర్తి నీటి సామర్థ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉన్నది.