Singareni Accident | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్లో ప్రమాదం జరిగింది. గనిలో బ్లాస్టింగ్కు వినియోగించే పూర్ణిని స్కాన్ చేస్తున్న సమయంలో శ్రీరాములు ప్రవీణ్ అనే కార్మికుడి చేతిలో పేలిపోయింది. ఈ ఘటనలో కార్మికుడి చేతి వేళ్లు తీవ్రంగా దెబ్బతిని ఊడిపోయాయి.
ప్రమాదం జరిగిన వెంటనే కార్మికుడిని తోటి కార్మికులు సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ప్రమాదంపై సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గనుల్లో నాసిరకం సామగ్రిని ఉపయోగిస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఘటనకు గని మేనేజర్ రమేశ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.