మేడ్చల్ మల్కాజిగిరి : బైకు(Bike)ను డీసీఎం(DCM) ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాద కర సంఘటన శామీర్పేట(Sameerpet) వద్ద గల రాజీవ్ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.