కరీంనగర్ : కరీనంగర్(Karinnagar) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొట్టడంతో(Road accident) ఒకరు(One person died )మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కేశవప ట్నంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కరీనంగర్ జిల్లా మానకొండూర్ శంకరపట్నం మండ లంలోని చింతగట్టుకు చెందిన మామ అల్లుళ్లు ఆంజనేయులు(33), హరీశ్ జమ్మికుంటలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి బైక్పై వెళ్లారు.
తిరిగి స్వగ్రామం వెళ్తుండగా కేశవపట్నం బస్టాండ్ వద్ద సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బైక్పై వెనకాల కూర్చున్న ఆంజనేయులుకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హరీశ్ క్షేమంగా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.