నందిపేట్, ఫిబ్రవరి 24: షాపులో చోరీ చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకరు మృత్యు ఒడికి చేరగా.. మరొకరు తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురువారం రాత్రి నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు దుండగులు ఖుద్వాన్పూర్లోని ఓ దుకాణం షట్టర్ను ధ్వం సం చేసి లోపలికి చొరబడ్డారు. దీన్ని గమనించిన చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో గ్రామస్థులు పోగయ్యారు. వారిని చూసి నిందితులు తాము తెచ్చుకున్న బైక్పై నందిపేట్ వైపు పరారయ్యారు. తప్పించుకోవాలన్న ఆతృతతో బైక్ను వేగంగా నడుపుతూ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని గ్రామస్థులు, పోలీసులు అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తుండగా ఒకరు మార్గమధ్యలోనే మృతి చెందగా.. మరొకరు జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. నిందితులు తీసుకొచ్చిన బైక్ గురించి పోలీసులు వివరాలు సేకరించగా మేడ్చల్లో చోరీకి గురైనట్టు తేలింది.