హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలో ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగం కారణంగా అదుపుతప్పడంతో ఫుట్పాత్పైకి ట్రావెల్స్ బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో బస్సు కింద పడి బీడీఎల్ ఉద్యోగి యాదయ్య మరణించాడు.
అతివేగమే ప్రమాదానికి గల కారణమని తెలుస్తోంది. కాగా నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.