కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. పట్టణంలోని కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతులను ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ఆ కారుపై 9 చాలాన్లు ఉన్నాయని, అన్నీ ఓవర్స్పీడ్కు చెందనవేనని తెలిపారు.
ఆదివారం ఉదయం వికారాబాద్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. పరిగి మండలంలోని తొండపల్లి శివారులో బైకును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతులను కావలి సుభాని, గుర్రంపల్లి కృష్ణయ్యగా గుర్తించారు.