హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్లో (BB Nagar) రోడ్డు ప్రమాదం జరిగింది. పశువులను తరలిస్తున్న ఓ వ్యాను బీబీనగర్ ఎయిమ్స్ వద్ద జేసీబీని ఢీకొట్టింది. దీంతో వ్యాను డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రమాదంలో వ్యానులో ఉన్న ఏడు పశువులు తీవ్రంగా గాయపడ్డాయని తెలిపారు.