హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ (Old city)లో రోడ్డు ప్రమాదం జరిగింది. సంతోష్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఆర్డీఎల్ (DRDL) సమీపంలో బుధవారం తెల్లవారుజామున రెండు బైక్లు ఢీకొన్నాయి. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.