మహబూబ్నగర్: జిల్లాలోని ధర్మాపూర్ (Dharmapur) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-రాయచూర్ హైవేపై వేగంగా దూసుకొచ్చిన వాహనం బైకును ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.