హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అత్తాపూర్లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్గూడా చౌరస్తా వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి.. బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తలను ఢీకొట్టింది. దీంతో భర్త అక్కడికక్కడే మరణించగా, భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను దవాఖానకు తరలించారు.
బాధితులను కర్ణాటకకు చెందిన రత్తయ్య, మంజులగా గుర్తించారు. ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే సమయంలో లారీ అదుపుతప్పి పాదచారులపైకి దూసుకొచ్చింది పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.