హైదరాబాద్: నగర శివార్లలోని ఘట్కేసర్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ పరిధిలోని చౌదరిగూడా వద్ద బుధవారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఓ యువకుడు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
మృతిచెందిన యువకుడిని అఖిల్ (19)గా గుర్తించారు. కొర్రెములకు చెందిన విశాల్ (15), సురేష్ (20), షఫి (20) గాయపడ్డారని చెప్పారు. ప్రమాదానికి అతివేగమే కారణమని, కారులో మద్యం సీసాలు ఉన్నాయని చెప్పారు. కారును కిరాయికి తీసుకున్నారని, ఓవర్ స్పీడ్తో వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.