హైదరాబాద్: నగరంలోని అబిడ్స్లో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం అబిడ్స్ జీపీవో వద్ద బైకు, బస్సు ఢీకొన్నాయి. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.