రంగారెడ్డి: జిల్లాలోని కొందుర్గ్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని శ్రీరంగాపూర్ గేట్ వద్ద బొలెరో వాహనం, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఒకరు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనాల్లో చిక్కుకున్న ముగ్గురిని జేసీబీ సాయంతో బయటకు తీశారు. వారికి కాళ్లు, చేతులు విరిగాయని తెలిపారు. బాధితులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.